బహ్రెయిన్లో ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- January 04, 2026
మనామా: బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఓపెన్ హౌస్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా పలు ఫిర్యాదులకు పరిష్కారం చూపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఓపెన్ హౌస్ లోఎంబసీ కాన్సులర్ మరియు కమ్యూనిటీ వెల్ఫేర్ బృందాలు, న్యాయ నిపుణులు పాల్గొన్నారు.
అలీ అల్దాయిసి హోల్డింగ్కు చెందిన 19 మంది కార్మికులతో సహా అనేక మంది భారతీయ పౌరుల విడుదలకు సంబంధించిన కేసులను పరిష్కరించారు. మద్దతుగా నిలిచిన తెలుగు కళా సమితి, తమిళ సామాజిక & సాంస్కృతిక సంఘం (TASCA) మరియు భారతి అసోసియేషన్కు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా మదద్ 2.0 ను ప్రారంభించారు. ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ (https://madad.gov.in/) యొక్క ఈ అప్గ్రేడ్ వెర్షన్ విదేశాలలో నివసిస్తున్న భారతీయ పౌరులకు మరింత సమర్థవంతమైన సహాయాన్ని అందించడానికి దీనిని రూపొందించారు. ఇంటరాక్టివ్ సెషన్లో అనేక సమస్యలను నేరుగా పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









