బహ్రెయిన్లో ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- January 04, 2026
మనామా: బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఓపెన్ హౌస్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా పలు ఫిర్యాదులకు పరిష్కారం చూపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఓపెన్ హౌస్ లోఎంబసీ కాన్సులర్ మరియు కమ్యూనిటీ వెల్ఫేర్ బృందాలు, న్యాయ నిపుణులు పాల్గొన్నారు.
అలీ అల్దాయిసి హోల్డింగ్కు చెందిన 19 మంది కార్మికులతో సహా అనేక మంది భారతీయ పౌరుల విడుదలకు సంబంధించిన కేసులను పరిష్కరించారు. మద్దతుగా నిలిచిన తెలుగు కళా సమితి, తమిళ సామాజిక & సాంస్కృతిక సంఘం (TASCA) మరియు భారతి అసోసియేషన్కు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా మదద్ 2.0 ను ప్రారంభించారు. ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ (https://madad.gov.in/) యొక్క ఈ అప్గ్రేడ్ వెర్షన్ విదేశాలలో నివసిస్తున్న భారతీయ పౌరులకు మరింత సమర్థవంతమైన సహాయాన్ని అందించడానికి దీనిని రూపొందించారు. ఇంటరాక్టివ్ సెషన్లో అనేక సమస్యలను నేరుగా పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం







