బ్రెయిన్ డెడ్ బాలుడి కుటుంబానికి సీఎం చంద్రబాబు అభినందనలు
- January 04, 2026
అమరావతి: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేసి, ఐదుగురికి ప్రాణం పోసిన కర్నూలు జిల్లాకు చెందిన కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు. ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని, సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
ర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చెందిన 15 ఏళ్ల బాలుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు.ఈ విషాద సమయంలోనూ ఆ బాలుడి కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకొచ్చి అవయవదానానికి అంగీకరించారు. వారి నిర్ణయం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురికి కొత్త జీవితం లభించింది. ఈ గొప్ప త్యాగం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదే సమయంలో, తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయ వైద్యులను కూడా సీఎం అభినందించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక యువతికి విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసినందుకు వైద్య బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!









