అబుదాబి కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ తోబుట్టువులు, పనిమనిషి మృతి..!!
- January 05, 2026
యూఏఈః అబుదాబిలో శనివారం ఉదయం జరిగిన ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ తోబుట్టువులు మరియు వారి పనిమనిషి మరణించారని యూఏఈకి చెందిన ఒక సామాజిక కార్యకర్త తెలిపారు. అబుదాబి-దుబాయ్ రోడ్డులోని షహామా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన కుటుంబ సభ్యులు రస్ అల్ ఖైమా నివాసితులు. రాజధానిలో జరిగిన సాంస్కృతిక ఉత్సవానికి హాజరైన తర్వాత తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో గాయపడ్డ తండ్రి మరియు తల్లి, వారి 14 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. వారు అబుదాబిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని సామాజిక కార్యకర్త చెప్పారు. ప్రమాదం జరిగిన అబుదాబిలోనే వారి మృతదేహాలను ఖననం చేయాలని వారి కుటుంబం తమ్మల్ని సంప్రదించిందని, కానీ దాని కోసం ప్రత్యేక అనుమతి అవసరం అని అన్నారు. యూఏఈలో మరణించిన వ్యక్తిని వారి నివాస వీసా జారీ చేయబడిన ఎమిరేట్లోనే ఖననం చేయాలి. అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు సామాజిక కార్యకర్త తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల పై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!









