బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ మెసేజుల హల్చల్..అలెర్ట్ జారీ..!!
- January 09, 2026
మనామాః బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ జరిమానాల మెసేజులు హల్చల్ చేయడంపై జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ స్పందించింది. వైరలవుతున్న మోసపూరిత టెక్స్ట్ మెసేజుల గురించి అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఈ మెసేజులను అనుమానాస్పద లింక్ల ద్వారా వస్తాయని, ట్రాఫిక్ జరిమానాలు చెల్లించమని అడుగుతాయని, చెల్లింపు చేయకపోతే తక్షణ జరిమానాలు విధిస్తామని బెదిరిస్తారని పేర్కొన్నారు.
ఇలాంటి మోసపూరిత మెసేజులకు స్పందించవద్దని సూచించారు. లింకులను క్లిక్ చేయగానే పర్సనల్ డేటా చోరీ అవుతుందని, అనంతరం డబ్బులు కూడా మాయం చేస్తారని హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత మెసేజులపై హాట్ లైన్ 992 నెంబర్ లో సమాచారం అందించాలని అవినీతి నిరోధక, ఆర్థిక & ఎలక్ట్రానిక్ భద్రత జనరల్ డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









