బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ మెసేజుల హల్చల్..అలెర్ట్ జారీ..!!
- January 09, 2026
మనామాః బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ జరిమానాల మెసేజులు హల్చల్ చేయడంపై జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ స్పందించింది. వైరలవుతున్న మోసపూరిత టెక్స్ట్ మెసేజుల గురించి అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఈ మెసేజులను అనుమానాస్పద లింక్ల ద్వారా వస్తాయని, ట్రాఫిక్ జరిమానాలు చెల్లించమని అడుగుతాయని, చెల్లింపు చేయకపోతే తక్షణ జరిమానాలు విధిస్తామని బెదిరిస్తారని పేర్కొన్నారు.
ఇలాంటి మోసపూరిత మెసేజులకు స్పందించవద్దని సూచించారు. లింకులను క్లిక్ చేయగానే పర్సనల్ డేటా చోరీ అవుతుందని, అనంతరం డబ్బులు కూడా మాయం చేస్తారని హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత మెసేజులపై హాట్ లైన్ 992 నెంబర్ లో సమాచారం అందించాలని అవినీతి నిరోధక, ఆర్థిక & ఎలక్ట్రానిక్ భద్రత జనరల్ డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







