‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి
- January 09, 2026
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ సినిమాకి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ (TG) రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మేరకు స్పెషల్ జీవో జారీ చేసింది. జనవరి 9 నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్ల్లో రూ.132 అదనంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 18 వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్ల్లో రూ.89 పెంపునకు వెసులుబాటు కల్పించింది. జీఎస్టీతో కలుపుకొని ఈ ధరలు ఉండబోతున్నాయి. పది రోజుల పాటు ఈ స్పెషల్ రేట్లు అమల్లో ఉంటాయి.
టికెట్ హైక్స్ ద్వారా వచ్చిన లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్ అకౌంట్ లోకి వెళ్తుందని ఆదేశాలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.హారర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







