థర్డ్ పార్టీలతో ఓవర్నైట్ క్యాష్ స్టోరేజ్ ఆపాలన్న సెంట్రల్ బ్యాంక్..!!
- January 11, 2026
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) స్థానిక బ్యాంకులకు కీలక సూచనలు జారీ చేసింది. థర్డ్ పార్టీలతో బ్యాంకు యాజమాన్యంలోని నగదును భద్రపరచడం మరియు నిల్వ చేయడాన్ని ఆపాలని ఆదేశించింది. ఓవర్నైట్ క్యాష్ స్టోరేజ్ కారణంగా చట్టపరమైన మరియు భద్రతా ప్రమాదాలు పెరిగాయని పేర్కొంది.
అధికారిక డేటా ప్రకారం, గత సెప్టెంబర్ చివరి నాటికి ATM ఉపసంహరణ లావాదేవీలు KD 6.835 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది మొత్తం కార్డ్ ఆధారిత లావాదేవీలలో 19.9 శాతం. కువైట్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,400 ATMలు ఉన్నాయి.
లైసెన్స్ లేని ప్రదేశాలలో పెద్ద మొత్తంలో క్యాష్ స్టోర్ చేసిన సంఘటనలను గుర్తించిన తర్వాత ఈ ఆదేశం జారీ చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. బ్యాంకులకు చెందిన అన్ని నగదును బ్యాంకులు స్వయంగా పర్యవేక్షించే ప్రాంగణాలలో మాత్రమే స్టోర్ చేయాలని సూచించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన భద్రతా వ్యవస్థలు మరియు ఫైర్ ఫ్రూప్ తో పాటు 24/7 భద్రతా పర్యవేక్షణ కోసం ఒక సమగ్ర వ్యవస్థను అమలు చేయాలని బ్యాంకులను సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







