థర్డ్ పార్టీలతో ఓవర్నైట్ క్యాష్ స్టోరేజ్ ఆపాలన్న సెంట్రల్ బ్యాంక్..!!
- January 11, 2026
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) స్థానిక బ్యాంకులకు కీలక సూచనలు జారీ చేసింది. థర్డ్ పార్టీలతో బ్యాంకు యాజమాన్యంలోని నగదును భద్రపరచడం మరియు నిల్వ చేయడాన్ని ఆపాలని ఆదేశించింది. ఓవర్నైట్ క్యాష్ స్టోరేజ్ కారణంగా చట్టపరమైన మరియు భద్రతా ప్రమాదాలు పెరిగాయని పేర్కొంది.
అధికారిక డేటా ప్రకారం, గత సెప్టెంబర్ చివరి నాటికి ATM ఉపసంహరణ లావాదేవీలు KD 6.835 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది మొత్తం కార్డ్ ఆధారిత లావాదేవీలలో 19.9 శాతం. కువైట్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,400 ATMలు ఉన్నాయి.
లైసెన్స్ లేని ప్రదేశాలలో పెద్ద మొత్తంలో క్యాష్ స్టోర్ చేసిన సంఘటనలను గుర్తించిన తర్వాత ఈ ఆదేశం జారీ చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. బ్యాంకులకు చెందిన అన్ని నగదును బ్యాంకులు స్వయంగా పర్యవేక్షించే ప్రాంగణాలలో మాత్రమే స్టోర్ చేయాలని సూచించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన భద్రతా వ్యవస్థలు మరియు ఫైర్ ఫ్రూప్ తో పాటు 24/7 భద్రతా పర్యవేక్షణ కోసం ఒక సమగ్ర వ్యవస్థను అమలు చేయాలని బ్యాంకులను సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







