థర్డ్ పార్టీలతో ఓవర్నైట్ క్యాష్ స్టోరేజ్ ఆపాలన్న సెంట్రల్ బ్యాంక్..!!
- January 11, 2026
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) స్థానిక బ్యాంకులకు కీలక సూచనలు జారీ చేసింది. థర్డ్ పార్టీలతో బ్యాంకు యాజమాన్యంలోని నగదును భద్రపరచడం మరియు నిల్వ చేయడాన్ని ఆపాలని ఆదేశించింది. ఓవర్నైట్ క్యాష్ స్టోరేజ్ కారణంగా చట్టపరమైన మరియు భద్రతా ప్రమాదాలు పెరిగాయని పేర్కొంది.
అధికారిక డేటా ప్రకారం, గత సెప్టెంబర్ చివరి నాటికి ATM ఉపసంహరణ లావాదేవీలు KD 6.835 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది మొత్తం కార్డ్ ఆధారిత లావాదేవీలలో 19.9 శాతం. కువైట్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,400 ATMలు ఉన్నాయి.
లైసెన్స్ లేని ప్రదేశాలలో పెద్ద మొత్తంలో క్యాష్ స్టోర్ చేసిన సంఘటనలను గుర్తించిన తర్వాత ఈ ఆదేశం జారీ చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. బ్యాంకులకు చెందిన అన్ని నగదును బ్యాంకులు స్వయంగా పర్యవేక్షించే ప్రాంగణాలలో మాత్రమే స్టోర్ చేయాలని సూచించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన భద్రతా వ్యవస్థలు మరియు ఫైర్ ఫ్రూప్ తో పాటు 24/7 భద్రతా పర్యవేక్షణ కోసం ఒక సమగ్ర వ్యవస్థను అమలు చేయాలని బ్యాంకులను సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









