థర్డ్ పార్టీలతో ఓవర్నైట్ క్యాష్ స్టోరేజ్ ఆపాలన్న సెంట్రల్ బ్యాంక్..!!
- January 11, 2026
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) స్థానిక బ్యాంకులకు కీలక సూచనలు జారీ చేసింది. థర్డ్ పార్టీలతో బ్యాంకు యాజమాన్యంలోని నగదును భద్రపరచడం మరియు నిల్వ చేయడాన్ని ఆపాలని ఆదేశించింది. ఓవర్నైట్ క్యాష్ స్టోరేజ్ కారణంగా చట్టపరమైన మరియు భద్రతా ప్రమాదాలు పెరిగాయని పేర్కొంది.
అధికారిక డేటా ప్రకారం, గత సెప్టెంబర్ చివరి నాటికి ATM ఉపసంహరణ లావాదేవీలు KD 6.835 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది మొత్తం కార్డ్ ఆధారిత లావాదేవీలలో 19.9 శాతం. కువైట్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,400 ATMలు ఉన్నాయి.
లైసెన్స్ లేని ప్రదేశాలలో పెద్ద మొత్తంలో క్యాష్ స్టోర్ చేసిన సంఘటనలను గుర్తించిన తర్వాత ఈ ఆదేశం జారీ చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. బ్యాంకులకు చెందిన అన్ని నగదును బ్యాంకులు స్వయంగా పర్యవేక్షించే ప్రాంగణాలలో మాత్రమే స్టోర్ చేయాలని సూచించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన భద్రతా వ్యవస్థలు మరియు ఫైర్ ఫ్రూప్ తో పాటు 24/7 భద్రతా పర్యవేక్షణ కోసం ఒక సమగ్ర వ్యవస్థను అమలు చేయాలని బ్యాంకులను సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







