ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- January 12, 2026
ఖసాబ్: ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రిని ఒమన్ సుల్తాన్ సతీమణి, హానరబుల్ లేడీ సయ్యిదా అహ్ద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించారు. ఆధునాతన వైద్య పరికరాలను పరిశీలించారు. ముసందమ్ గవర్నరేట్లోని పౌరులు మరియు నివాసితులకు అధునాతన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా ముసందమ్ గవర్నరేట్కు చెందిన జానపద కళా బృందాలు వివిధ సాంప్రదాయ ఒమానీ వారసత్వ కళలను ప్రదర్శించారు. స్వాగత కార్యక్రమంలో స్థానిక పాఠశాలల విద్యార్థులు తమ ఆట పాటలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హిలాల్ అలీ అల్ సబ్తి, ముసందమ్ గవర్నర్ సయ్యిద్ ఇబ్రహీం సయీద్ అల్ బుసైది, విద్యాశాఖ మంత్రి డాక్టర్ మదిహా అహ్మద్ అల్ షైబానీ, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ లైలా అహ్మద్ అల్ నజ్జార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







