బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- January 18, 2026
మనామా: బహ్రెయిన్ లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లను నియమించే ప్రతిపాదనపై పార్లమెంటులో చర్చకు రానుంది. ఎంపీలు డాక్టర్ మహదీ అల్ షువైఖ్, అబ్దుల్నబీ సల్మాన్, మమ్దౌహ్ అల్ సలేహ్, హసన్ ఇబ్రహీం మరియు డాక్టర్ హిషామ్ అల్ అషిరి సమర్పించిన ఈ ప్రణాళిక, క్రీడా ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి వారి సామర్థ్యాలను మెరుగు పరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
స్పెషలిస్ట్ కోచ్లు అథ్లెటిక్గా ప్రతిభావంతులైన విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరుస్తారని డాక్టర్ అల్ షువైఖ్ తెలిపారు. అయితే, విద్యార్థుల ప్రతిభను పెంపొందించడానికి ఇప్పటికే కృషి చేస్తున్నామని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. PE ఉపాధ్యాయులు మరియు పాఠశాలల్లో క్రీడా పోటీలు వ్యక్తిగత క్రీడలను కవర్ చేస్తాయని, ప్రతిభ ఉన్న అథ్లెట్లను గుర్తించి ప్రోత్సాహిస్తున్నామని తెలిపింది.
ఈ సందర్భంగా బహ్రెయిన్లో జరిగిన 2024 అంతర్జాతీయ పాఠశాల క్రీడలను మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. ఇక్కడ విద్యార్థులు 66 పతకాలు గెలుచుకున్నారని, అరబ్ దేశాలలో నాల్గవ స్థానంలో మరియు ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచారని, జిమ్నాసియేడ్ అంతర్జాతీయ పాఠశాల ఛాంపియన్షిప్లో విజయం సాధించారని గుర్తుచేసింది.
పాఠశాల క్రీడల సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని మరియు మద్దతు ఇస్తామని, ఈ విషయంలో పార్లమెంటుకు మరింత స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు విద్యామంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









