ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- January 20, 2026
తిరుమల: ఈ ఏడాది మార్చి చివరి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఆలయాల్లో భక్తులకు రోజుకు రెండుసార్లు అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టీటీడీ కార్యనిర్వాహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసే దిశగా సన్నాహాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఇప్పటివరకు కొద్దిపాటి ఆలయాల్లో పరిమితంగా ఉన్న అన్నప్రసాద వితరణను, ఇకపై అన్ని టీటీడీ ఆలయాలకు విస్తరించనున్నారు. దీనివల్ల రోజూ వేలాది మంది భక్తులకు అన్నదానం చేసే అవకాశం ఏర్పడనుంది. ఇదే సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ ముందడుగు వేస్తోందని అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. గౌహతి, పాట్నా, కోయంబత్తూరు, బెల్గాం నగరాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి అవసరమైన భూములను ఇప్పటికే కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ఆలయాల ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఉన్న భక్తులకు కూడా తిరుమల శ్రీవారి దర్శన అనుభూతిని కల్పించాలన్నదే లక్ష్యమని చెప్పారు.
అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈవో స్పష్టం చేశారు. పారదర్శకంగా నియామక ప్రక్రియను చేపడతామని, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!









