గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- January 20, 2026
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ఈ ఏడాది జనవరి 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు నిర్వహించబడే ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమ్మిట్ను ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ మరియు విజ్ఞాన్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించనున్నారు.
ఈ సదస్సు ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనలో అంతరిక్ష సాంకేతిక(Space Technology) పరిజ్ఞానం, పరిశోధన, వినియోగతత్వం మరియు భారత అంతరిక్ష రంగ అభివృద్ధిలో దాని పాత్రపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ప్రత్యేకంగా యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త ఆవిష్కరణలపై చర్చలు జరిపేందుకు అవకాశం కల్పించబడింది.
వర్సిటీ అధికారులు తెలిపారు, ఈ సదస్సు రాష్ట్ర అంతరిక్ష రంగ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని, అంతరిక్ష పరిశోధనలలో యువతను ప్రోత్సహించడం, స్థానిక పరిశ్రమలకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో భాగస్వామ్యం చేయడం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటుందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ఇన్చార్జి వీసీ కృష్ణకిషోర్ సమ్మిట్ ప్రారంభానికి ముందే బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సదస్సులో పరిశోధన ప్రదర్శనలు, వర్క్షాప్లు, ప్యానెల్ చర్చలు మరియు ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఉండనున్నాయి. ఈ కార్యక్రమం రాష్ట్రంలో అంతరిక్ష పరిశోధన రంగానికి కొత్త దిశను చూపే అవకాశం ఉందని వీసీ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







