తన ఇండస్ట్రీ పై దృష్టి సారిస్తున్న ఆ పాపులర్ హీరో!
- January 28, 2026
ఇతర ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్స్ కారణంగా మాలీవుడ్ పై తన లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గించిన పృధ్వీరాజ్ సుకుమారన్ మళ్లీ కేరళ ఆడియన్స్ పలకరించబోతున్నాడు. లాస్ట్ ఇయర్ ఎంపురన్2లో కనిపించినప్పటికీ.. క్రెడిట్ మోహన్ లాల్ ఖాతాలో చేరిపోయింది. ఆ తర్వాత విలయాత్ బుద్ద అనే సినిమా చేశాడు కానీ ఆ మూవీ ఒకటి వచ్చిందన్న విషయం కూడా కేరళ ఆడియన్స్ మర్చిపోయారంటే.. సినిమా ఏ లెవల్లో ఆడిందో అర్థం చేసుకోవచ్చు.
ద గోట్ లైఫ్, గురుర్ అంబలనడయిల్ తర్వాత సోలో హీరోగా వరదరాజ మన్నార్ హిట్ కొట్టిన దాఖలాలు లేవు. సొంత గూటికి కాస్త దూరంగా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ వారణాసి, దైరాతో బిజీగా ఉన్నాడు. సలార్2 కూడా లైన్లో ఉంది. ఈ పొరుగు ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్ట్స్ తన ఇమేజ్, మార్కెట్ డబుల్ చేస్తాయి కానీ కేరళ ఆడియన్స్తో టచ్ పోతే.. అసలుకే మోసం వస్తుందనుకున్నాడేమో.. ఈ ఏడాది సొంత గూటిలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేయబోతున్నాడు పృధ్వీ. నిషామ్ బషీర్ దర్శకత్వంలో వస్తున్న ఐ నోబడీలో నటిస్తున్నాడు పృధ్వీ రాజ్ సుకుమారన్. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఖలీఫా ఓనం సందర్భంగా ఆగస్టు 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విపిన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంతోష్ ట్రోపీ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతోంది. అలాగే హిందీలో కరీనా కపూర్- మేఘనా గుల్జార్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ దైరా కూడా 2026నే ప్రేక్షకుల ముందకు రాబోతోంది. మొత్తానికి సౌత్ పోల్, ఇటు నార్త్ పోల్ ని చుట్టేయడానికి సిద్ధమౌతున్నాడు రణ కుంభ.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









