వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా సినారె 86వ జన్మదినోత్సవ వేడుకలు
- July 29, 2016
తెలుగు జాతి కీర్తిని తనదైన శైలిలో విశ్వవ్యాప్తం చేసిన కవి సి. నారాయణరెడ్డి అని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కొనియాడారు. వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సినారె 86వ జన్మదినోత్సవాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రచించిన నూతన కవితా సంపుటి 'నా రణం మరణం పైనే' పుస్తకాన్ని విద్యాసాగర్రావు ఆవిష్కరించారు. రాజ్ ఫౌండేషన్ రూపొందించిన డాక్టర్ సినారె సమగ్ర సాహిత్యం ఆడియోని ఆవిష్కరించిన డా.యార్లగెడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. సినారెకి తాను ఏకలవ్య శిశ్యుడినని ప్రకటించుకున్నారు. సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, అమెరికాకు చెందిన ప్రముఖ గాయని శారద ఆకునూరి, జుర్రుచెన్నయ్య, నిర్వాహకులు వంశీ రామరాజు, తెన్నేటి సుధాదేవి, శుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







