వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా సినారె 86వ జన్మదినోత్సవ వేడుకలు
- July 29, 2016
తెలుగు జాతి కీర్తిని తనదైన శైలిలో విశ్వవ్యాప్తం చేసిన కవి సి. నారాయణరెడ్డి అని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కొనియాడారు. వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సినారె 86వ జన్మదినోత్సవాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రచించిన నూతన కవితా సంపుటి 'నా రణం మరణం పైనే' పుస్తకాన్ని విద్యాసాగర్రావు ఆవిష్కరించారు. రాజ్ ఫౌండేషన్ రూపొందించిన డాక్టర్ సినారె సమగ్ర సాహిత్యం ఆడియోని ఆవిష్కరించిన డా.యార్లగెడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. సినారెకి తాను ఏకలవ్య శిశ్యుడినని ప్రకటించుకున్నారు. సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, అమెరికాకు చెందిన ప్రముఖ గాయని శారద ఆకునూరి, జుర్రుచెన్నయ్య, నిర్వాహకులు వంశీ రామరాజు, తెన్నేటి సుధాదేవి, శుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









