అక్షర మాల ప్రకారం రాష్ట్రం వెనుకబడటం !
- July 29, 2016
అక్షర మాల ప్రకారం రాష్ట్రం వెనుకబడటంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ సమావేశాల్లో తమ రాష్ట్రం సమస్యలను వినిపించేందుకు అవకాశం దొరకడం లేదని బాధపడుతున్నారు. వెస్ట్ బెంగాల్... డబ్ల్యూతో ప్రారంభమవుతుంది కనుక సమావేశాల చివర్లో ఆ రాష్ట్రం తరపున వాదనలు వినిపించవలసి వస్తోందని, అప్పటికి ఇతర రాష్ట్రాల వాదనలు వినే కేంద్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు నీరసించిపోతున్నారని, ఫలితంగా తమకు అవకాశం దక్కడం లేదని వాపోతున్నారు. అందుకే దీనికి పరిష్కారంగా ఆమె తన రాష్ట్రం పేరును బెంగాల్ అని కానీ, బంగ్లా అని కానీ మార్చాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







