ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- January 21, 2026
భారత్, స్పెయిన్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలనేనని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచం సహించకూడదని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రపంచ దేశాల సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. దిల్లీలో స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్తో జైశంకర్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇరుదేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచంలో పరిణామాలు క్రమంగా మారుతున్నాయి. ఉమ్మడి సవాళ్లపై దేశాలు పరస్పరం సహకరించడం గతంలో కంటే ఇప్పుడు చాలా అవసరం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఈ సహకారం మరింత అవసరం. భారత్, స్పెయిన్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలు. ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు సహించకూడదు. టెర్రరిజం పట్ల జీరో టాలరెన్స్ ప్రదర్శించాలి.” అని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు.
భారత్, స్పెయిన్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలు
అలాగే స్పెయిన్లోని కార్డోబాలో జనవరి 18న జరిగిన రైలు ప్రమాదంపైనా జైశంకర్ స్పందించారు. ఆ రైలు యాక్సిడెంట్లో మరణించిన 40 మంది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలువాలని ఆకాక్షించారు. కాగా, పట్టాలు తప్పిన హైస్పీడ్ రైలును మరో హైస్పీడ్ రైలు ఢీకొనడంతో స్పెయిల్లో దుర్ఘటన జరిగింది. ఈ యాక్సిడెంట్లో 40 మంది చనిపోగా, మరో 150 మందికిపైగా గాయపడ్డారు. “భారత్, స్పెయిన్ స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి అని జైశంకర్ వెల్లడించారు.
ఈయూ-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
సంస్కృతి, పర్యాటకం, కృత్రిమ మేధస్సు కోసం ఉద్దేశించిన డ్యూయల్ ఇయర్కు సంబంధించిన లోగో భారత్, స్పెయిన్ ఉమ్మడి దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ” అని అల్బరేస్ వెల్లడించారు. ప్రపంచంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో భారత్ వంటి విశ్వసనీయ దేశంతో స్పెయిన్ సంబంధాలను పెంపొందించుకోవడం చాలా అవసరమని అల్బరేస్ అభిప్రాయపడ్డారు. “ప్రపంచంలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్న ఈ సమయంలో అంతర్జాతీయ చట్టాన్ని విశ్వసించే, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను సమర్థించే భారత్ వంటి విశ్వసనీయ దేశంతో సంబంధాలను పెంపొందించుకోవడం స్పెయిన్కు చాలా ముఖ్యం. ఈయూ-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరితే ఒక సానుకూల సంకేతం అవుతుంది. స్పెయిన్, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు ఆర్థిక వ్యవస్థలు. ” అని అల్బరేస్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







