ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- February 03, 2026
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (సీబీకే) ఎక్స్ఛేంజ్ కంపెనీలు కస్టమర్ల నుండి స్వీకరించగల రోజువారీ క్యాష్ లిమిట్ ను రోజుకు కేడీ 1,000కి తగ్గించింది. ఈ మేరకు కొత్త నిబంధనలు ఫిబ్రవరి 2 నుండి అమలులోకి వచ్చాయని ఒక ప్రకటలో తెలిపింది. అయితే, గతంలో కస్టమర్లు కేడీ 3,000 వరకు నగదు రూపంలో చెల్లించడానికి అనుమతి ఉండేది. కానీ కొత్త నిబంధన ప్రకారం, ఎక్స్ఛేంజ్ కంపెనీలలో కేడీ 1,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులను ఇకపై అనుమతించరు.
అయితే, లావాదేవీల మొత్తం విలువపై ఎటువంటి పరిమితి లేదని, ఈ పరిమితి చెల్లింపులోని నగదుకు మాత్రమే వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. విదేశీ డబ్బు బదిలీలకు అలాగే విదేశీ కరెన్సీల కొనుగోలు మరియు అమ్మకాలకు కూడా వర్తిస్తుందని తెలియజేసింది. మనీలాండరింగ్ మరియు ఉగ్రవాదానికి నిధుల సరఫరాకు వ్యతిరేకంగా నియంత్రణలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కువైట్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







