మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- February 04, 2026
మనామా: ఒక ఆసియా వ్యక్తిని హత్య చేసిన కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన దర్యాప్తును పూర్తి చేసిందని మరియు ఒకే జాతీయతకు చెందిన ఇద్దరు అనుమానితులను క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేసినట్లు నార్తర్న్ గవర్నరేట్ ప్రాసిక్యూటర్ ప్రకటించారు. విచారణ ఫిబ్రవరి 9న హై క్రిమినల్ కోర్టు ముందు జరగనుంది.
అల్-బుదయ్య ప్రాంతంలోని ఒక సందులో బాధితుడి మృతదేహాన్ని గుర్తించినట్టు నార్తర్న్ గవర్నరేట్ డైరెక్టరేట్ తెలిపింది. ఫిర్యాదు అందిన వెంటనే, పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు, నిందితులు నేరం చేసినట్లు అంగీకరించారు. 12 సంవత్సరాల క్రితం తమ స్వదేశంలో జరిగిన వివాదం ఈ దాడికి కారణమైందని, బంధువుపై ప్రతీకారంగా ఈ హత్యకు ప్రణాళిక వేసుకున్నట్టు వారు వెల్లడించారు.
నిందితులు రెండు నెలల పాటు బాధితుడిని వెంబడించి, హత్య జరిగిన రోజు అతని ఇంటి సమీపంలో అతనిపై దాడి చేసి, అనేకసార్లు పొడిచి చంపి, పారిపోయారని బాధితులు తెలిపారు. ఆధారాలను సమీక్షించిన తర్వాత, పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులిద్దరినీ కస్టడీలోనే ఉంచి విచారణ చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







