వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- February 05, 2026
నఖల్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని నఖల్ విలాయత్లో ఉన్న వకాన్ విలేజ్ కు విజిటర్స్ పోటెత్తారు. 2025లో 39,976 మంది సందర్శించారు. ఇక్కడ వ్యవసాయ పొలాలు, పురాతన పర్వత మార్గాలలో ప్రయాణించడం వంటి విభిన్న అనుభవాలను విజిటర్స్ కు అందిస్తుంది. ఈ ప్రత్యేక కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహసయాత్రికులకు ఒక గమ్యస్థానంగా మారిందని దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని హెరిటేజ్ మరియు టూరిజం విభాగం డైరెక్టర్ డాక్టర్ అల్ ముతాసిమ్ నాజర్ అల్ హిలాలీ తెలిపారు.
ముఖ్యంగా వింటర్ చివరిలో (జనవరి మరియు ఫిబ్రవరి మధ్య) ప్రారంభమయ్యే ఆప్రికాట్ మరియు ప్లం పూల వికసించే కాలాన్ని చూడటానికి పర్యాటకులు అధికంగా వస్తారని వెల్లడించారు. అలాగే, అధికారిక సెలవులు మరియు వారాంతాల్లో గ్రామానికి సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే మరిన్ని ప్రత్యేక ఆకర్షణలు అందుబాటులో రానున్నాయని, దాంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









