వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- February 05, 2026
నఖల్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని నఖల్ విలాయత్లో ఉన్న వకాన్ విలేజ్ కు విజిటర్స్ పోటెత్తారు. 2025లో 39,976 మంది సందర్శించారు. ఇక్కడ వ్యవసాయ పొలాలు, పురాతన పర్వత మార్గాలలో ప్రయాణించడం వంటి విభిన్న అనుభవాలను విజిటర్స్ కు అందిస్తుంది. ఈ ప్రత్యేక కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహసయాత్రికులకు ఒక గమ్యస్థానంగా మారిందని దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని హెరిటేజ్ మరియు టూరిజం విభాగం డైరెక్టర్ డాక్టర్ అల్ ముతాసిమ్ నాజర్ అల్ హిలాలీ తెలిపారు.
ముఖ్యంగా వింటర్ చివరిలో (జనవరి మరియు ఫిబ్రవరి మధ్య) ప్రారంభమయ్యే ఆప్రికాట్ మరియు ప్లం పూల వికసించే కాలాన్ని చూడటానికి పర్యాటకులు అధికంగా వస్తారని వెల్లడించారు. అలాగే, అధికారిక సెలవులు మరియు వారాంతాల్లో గ్రామానికి సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే మరిన్ని ప్రత్యేక ఆకర్షణలు అందుబాటులో రానున్నాయని, దాంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం
- విద్యార్థుల సురక్షిత రవాణాకు సరికొత్త ప్రణాళిక: సైబరాబాద్ సీపీ రమేష్
- భారత్ లో ఇక ప్లాస్టిక్ కరెన్సీ!
- కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు..ఉదయ్ కృష్ణారెడ్డి స్ఫూర్తిదాయక విజయం
- దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో పునరుద్ధరణ
- గంటకు 200 కిమీ వేగంతో దూసుకెళ్లనున్న 'ఎతిహాద్ రైల్'..
- విద్యార్థినులకు ప్రతినెలా మూడు సెలవులు
- టీబీ నిర్మూలన, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన పెంచాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ నెట్వర్క్ల పై అమెరికా కొత్త ఆంక్షలు
- మార్కెట్లోకి భారీగా దొంగ నోట్లు..500, 200 నోట్లే టార్గెట్









