లోక్‌సభ స్పీకర్‌ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం

- February 10, 2026 , by Maagulf
లోక్‌సభ స్పీకర్‌ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం

న్యూ ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు లోక్‌సభ జనరల్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ లోక్‌సభ ఉపపక్షనేత గౌరవ్ గోగాయ్ తెలిపారు. అవిశ్వాస తీర్మాణానికి మద్దతుగా 100కి పైగా ఎంపీల సంతకాలు సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడంపై విపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. మహిళా MPల పేర్లు ప్రస్తావించడంపైనస 8మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపైన కూడా అసంతృప్తితో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు సమాచారం. అధికారపక్ష ఎంపీలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నట్లుగా స్పీకర్ వైఖరి ఉందని విపక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ను తొలిగించాలని అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com