లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అసెంబ్లీ స్పీకర్

- February 10, 2026 , by Maagulf
లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అసెంబ్లీ స్పీకర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం లోక్ భవన్‌లో గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 11, 2026న నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సిందిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ ఆహ్వానించారు.

శాసనసభ సమావేశాల ప్రాధాన్యం, ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ ప్రసంగం పాత్రపై ఇరువురు చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి, శాసనసభ కార్యకలాపాల సమర్థ నిర్వహణపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు. స్పీకర్ ఆహ్వానాన్ని గవర్నర్ సానుకూలంగా స్వీకరించినట్లు సమాచారం.

ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల్లో సమన్వయం మరింత బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com