మలేషియాలో ఏపీ వాసి మృతి
- February 15, 2026
కౌలాలంపూర్: అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె, కొన్నయ్యగారిపల్లి గ్రామానికి చెందిన బొమ్మవరం శంకరమ్మ గత సంవత్సరం 21 డిసెంబర్ 2025 న కోలాలంపూర్ హాస్పిటల్ లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల కలిగే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ తో మరణించింది.
ఈ విషయం ఆసుపత్రి సిబ్బంది ఇండియన్ ఎంబసీకి తెలియజేశారు, తర్వాత ఇండియన్ ఎంబసీ ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్,మలేషియా కి మరియు ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ కి వారి కుటుంబ సభ్యులను కానీ దగ్గర బంధువుల ను గుర్తించాలని అభ్యర్ధించింది.ఆ వెంటనే ఫెడరేషన్ అఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్ డిప్యూటీ ప్రెసిడెంట్ కృష్ణ ముత్తినేని మృతుని భర్త మరియు వారి బంధువుల ఆచూకీ కనుక్కొని బొమ్మవరం శంకరమ్మ మరణించిన వార్తని వారికీ తెలియజేసి మృతదేహం పంపడానికి కావాల్సిన డాకుమెంట్స్ అన్ని సేకరించి ఇండియన్ ఎంబసీ కి అందించి చివరగా మృతదేహాన్ని 13/02/2026 మలేసియా ఎయిర్ లైన్స్ M180 లో చెన్నై కి చేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సీఈఓ డాక్టర్ పి కృష్ణ మోహన్ గారు విమానాశ్రయం నుండి వారి గ్రామానికి ఉచితంగా అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు .
ఈ మృత దేహాన్ని పంపడానికి ఆయన మొత్తం ఖర్చు మలేషియా లోని ఇండియన్ ఎంబసీ పూర్తిగా భరించింది అని ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్ , మలేషియా ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి తెలియజేశారు.
అలాగే దీనికి సహకరించిన ఇండియన్ హై కమిషనర్ బి.ఎన్ రెడ్డికి, ఎఫ్.ఎన్.సి.ఏ-మలేషియా కోర్ కమిటీ సభ్యులకు మరియు APNRT సీఈఓ డాక్టర్ పి.కృష్ణ మోహన్ కి ఎఫ్.ఎన్.సి.ఏ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









