24 గంటల్లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ తో నాగబంధం టీజర్
- February 17, 2026
దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “నాగబంధం” పాన్-ఇండియా స్థాయిలో భారీ సంచలనం సృష్టిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ మిస్టికల్ ఎపిక్ టీజర్కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్కు పైగా వ్యూస్ సాధించి, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చార్ట్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం ద్వారా పాన్-ఇండియన్ లో అదరగొట్టింది.
ఈ అచీవ్మెంట్ ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది డైరెక్టర్ అభిషేక్ నామా విజన్. అంతర్జాతీయ స్థాయి విజువల్ స్పెక్టకిల్ను అందించారు. ఆయనతో పాటు హీరో విరాట్ కర్ణా, డెబ్యుటెంట్ నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి కలిసి వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు.
టీజర్లో ప్రత్యేక హైలెట్ గా నిలిచింది విరాట్ కర్ణా ట్రాన్స్ఫర్మేషన్. తన గత ఇమేజ్కు పూర్తి భిన్నంగా, శివుని అవతారంలా కనిపించడం, హై ఎనర్జీతో ఆయన చేసిన నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
టెక్నికల్ గా “నాగబంధం” కొత్త బెంచ్మార్క్ను సెట్ చేస్తోంది. హైఎండ్ VFXలు సహజంగా అనిపించేలా ఉండటం, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ , అద్భుతమైన సినిమాటోగ్రఫీ టీజర్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథలో ఉన్న భారీ స్కేల్ను నిజ జీవిత అనుభూతిగా మార్చేందుకు నిర్మాతలు ఎలాంటి ఖర్చుకూ వెనుకాడలేదని స్పష్టంగా తెలుస్తోంది.
టీజర్ హైప్ నుంచి సమ్మర్ రిలీజ్ దిశగా ప్రయాణిస్తున్న ఈ చిత్రం చుట్టూ ఉన్న బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. మోడరన్ స్టైల్లో పురాణ కథనాన్ని చూపిస్తూ, అభిషేక్ నామా, ఆయన టీమ్ ప్రేక్షకుల అంచనాలను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









