రియో పరుగును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ...
- July 31, 2016
దిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ జాతీయ మైదానంలో రియో పరుగును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దాదాపు 20వేల మంది విద్యార్థులు రియో పరుగులో పాల్గొన్నారు. ధ్యాన్చంద్ జాతీయ మైదానం నుంచి నెహ్రూ మైదానం వరకు పరుగు కొనసాగింది. ఈ సందర్భంగా భారత అథ్లెట్లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 119 మంది క్రీడాకారుల బృందాన్ని రియో ఒలింపిక్స్కు పంపిస్తున్నామని తెలిపారు. వచ్చే ఒలింపిక్స్కు మరింత పెద్ద బృందాన్ని పంపుతామని వెల్లడించారు. 2020 ఒలింపిక్స్ క్రీడల్లో ప్రతి జిల్లా నుంచి ఒక అథ్లెట్ ప్రాతినిధ్యం వహించాలని సూచించారు. భారత క్రీడాకారులు ప్రపంచ ప్రజల మనస్సులు గెలుచుకుంటారని ప్రధాని ఆకాంక్షించారు. కేంద్ర క్రీడల మంత్రి విజయ్గోయల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల









