రియో పరుగును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ...
- July 31, 2016
దిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ జాతీయ మైదానంలో రియో పరుగును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దాదాపు 20వేల మంది విద్యార్థులు రియో పరుగులో పాల్గొన్నారు. ధ్యాన్చంద్ జాతీయ మైదానం నుంచి నెహ్రూ మైదానం వరకు పరుగు కొనసాగింది. ఈ సందర్భంగా భారత అథ్లెట్లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 119 మంది క్రీడాకారుల బృందాన్ని రియో ఒలింపిక్స్కు పంపిస్తున్నామని తెలిపారు. వచ్చే ఒలింపిక్స్కు మరింత పెద్ద బృందాన్ని పంపుతామని వెల్లడించారు. 2020 ఒలింపిక్స్ క్రీడల్లో ప్రతి జిల్లా నుంచి ఒక అథ్లెట్ ప్రాతినిధ్యం వహించాలని సూచించారు. భారత క్రీడాకారులు ప్రపంచ ప్రజల మనస్సులు గెలుచుకుంటారని ప్రధాని ఆకాంక్షించారు. కేంద్ర క్రీడల మంత్రి విజయ్గోయల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







