కలెక్టర్ పాత్ర లో 'నయనతార..
- July 31, 2016
తన అభినయం, అందంతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకి 'నయనతార'. త్వరలో 'బాబు బంగారం' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ భామ ప్రస్తుతం గోపీనాయర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఓ జాతీయ సమస్య ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికే ఈ చిత్రం 40 శాతం చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తోంది. 'నయనతార.. సామాజిక సందేశంతో ముడిపడి ఉన్న ఈ కథవిన్న వెంటనే నటించడానికి ఒప్పుకున్నారు. ఈ చిత్రంలో ఆమె కలెక్టర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర తనకు అనేక అవార్డులను తెచ్చిపెట్టే విధంగా ఉందని నయనతార తెలిపింది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుకు దగ్గర్లో ఉన్న శ్రీహరికోట వద్ద జరిగింది. 'కాకముట్టై' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న చిన్నారులు విఘ్నేశ్, రమేశ్ ఇందులో నటిస్తున్నారు' అని గోపీ తెలిపారు.కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెమెరామన్: ఓం ప్రకాశ్, స్టంట్ మాస్టర్: పీటర్, ఎడిటర్: గోపీకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: లాల్గుడి ఇళయరాజా. ఓ ప్రముఖ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి పనిచేయనున్నారు, త్వరలో ఆయన పేరును కూడా ప్రకటిస్తామని నిర్మాత వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







