దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం

- February 20, 2026 , by Maagulf
దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూ ఢిల్లీ: ఉజ్బెకిస్థాన్, గాంబియా దేశాలలో భారతీయ ఫార్మా సంస్థలు తయారు చేసిన దగ్గు మందులు సేవించి చిన్నారులు మరణించిన ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఔషధాల తయారీకి పాల్పడిన సదరు ఫార్మా సంస్థ, అధికారులపై ధర్మాసనం మండిపడింది. “మీరు కేవలం డబ్బు కోసమే ఈ వ్యాపారం చేస్తున్నారా? మీ స్వార్థం వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దెబ్బతింటోంది” అని న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఈ కేసులో ఫార్మా సంస్థ, కొందరు అధికారులపై 2024 జనవరిలో యూపీలోని గౌతమ బుద్ధ నగర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు వీటిని కొట్టివేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మందులలో డై ఇథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనాలు కలవడం వల్ల కిడ్నీలు దెబ్బతిని మరణాలు సంభవిస్తున్నట్లు తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com