చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- February 21, 2026
తెలంగాణ: నిర్మల్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా చిరుత పులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా తానూరు, భైంసా, కుభీర్, కుంటాల మండలాల్లో చిరుత సంచరిస్తుండటంతో అటు రైతులు, ఇటు పశుపోషకులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
భైంసా మండలంలోని సిరాల గుహల్లో చిరుత పులి తన పిల్లలతో కలిసి ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇటీవల తిమ్మాపూర్ ప్రాంతంలో అడవి పందులు, జింకల సంచారం పెరిగింది. వీటిని వేటాడే క్రమంలోనే చిరుత వస్తోందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అడవి జంతువులు పొలాల్లోని మొక్కజొన్న పంటలను నాశనం చేస్తుండగా, వాటిని వెంబడిస్తూ వస్తున్న చిరుత పశువుల పాలిట యముడిగా మారింది.
స్థానిక రైతులు, పశువులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మేకలు, గొర్రెలు, లేగదూడలు, ఎద్దులు, గేదెలు వన్యమృగాల బారిన పడుతుండటంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి 17న భైంసా మండలం సిరాల శివారులో రైతు రామేశ్వర్కు చెందిన ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. గురువారం మాధవ్ మొక్కజొన్న పంటలోకి వచ్చిన జింకను చిరుత హతమార్చింది. అటవీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి చిరుత దాడేనని నిర్ధారించారు. దీంతో గ్రామస్తులు రాత్రివేళ పశువులను బయటకు కట్టడానికి వెనుకంజ వేస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









