ప్రొ కబడ్డీ టైటిల్ను కైవసం చేసుకున్న పట్నా పైరేట్స్
- July 31, 2016
ప్రొ కబడ్డీ లీగ్ - 4 ఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్పై పట్నా పైరేట్స్ విజయం సాధించింది. దాదాపు ఐదు వారాలుగా అభిమానులను అలరించిన కబడ్డీ టైటిల్ను పట్నా పైరేట్స్ కైవసం చేసుకుంది. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 37-29తో పట్నా గెలిచింది. ప్రొ కబడ్డీ లీగ్ను రెండు సార్లు గెలుచుకున్న తొలి జట్టుగా పట్నా రికార్డు సృష్టించింది.అంతకు ముందు మహిళల ప్రొ కబడ్డీ లీగ్ -1 ఫైనల్ మ్యాచ్లో ఫైర్బర్డ్స్ పై స్టార్మ్క్వీన్స్ ఘనవిజయం సాధించింది. చివరి వరకు ఉత్కఠంగా జరిగిన మ్యాచ్లో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. 22-23తో వెనకబడివున్న సమయంలో స్టార్మ్క్వీన్స్ రైడర్ తేజస్విని అద్బుత ఆట తీరును ప్రదర్శించింది. చివర్లో తేజస్విని రెండు పాయింట్లు సాధించి స్టార్మ్క్వీన్స్కు 24-23తో విజయాన్ని అందించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







