ప్రొ కబడ్డీ టైటిల్ను కైవసం చేసుకున్న పట్నా పైరేట్స్
- July 31, 2016
ప్రొ కబడ్డీ లీగ్ - 4 ఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్పై పట్నా పైరేట్స్ విజయం సాధించింది. దాదాపు ఐదు వారాలుగా అభిమానులను అలరించిన కబడ్డీ టైటిల్ను పట్నా పైరేట్స్ కైవసం చేసుకుంది. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 37-29తో పట్నా గెలిచింది. ప్రొ కబడ్డీ లీగ్ను రెండు సార్లు గెలుచుకున్న తొలి జట్టుగా పట్నా రికార్డు సృష్టించింది.అంతకు ముందు మహిళల ప్రొ కబడ్డీ లీగ్ -1 ఫైనల్ మ్యాచ్లో ఫైర్బర్డ్స్ పై స్టార్మ్క్వీన్స్ ఘనవిజయం సాధించింది. చివరి వరకు ఉత్కఠంగా జరిగిన మ్యాచ్లో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. 22-23తో వెనకబడివున్న సమయంలో స్టార్మ్క్వీన్స్ రైడర్ తేజస్విని అద్బుత ఆట తీరును ప్రదర్శించింది. చివర్లో తేజస్విని రెండు పాయింట్లు సాధించి స్టార్మ్క్వీన్స్కు 24-23తో విజయాన్ని అందించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







