అగర్తల బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైను ప్రారంభించిన రైల్వేమంత్రి సురేష్‌ప్రభు

- July 31, 2016 , by Maagulf
అగర్తల బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైను ప్రారంభించిన రైల్వేమంత్రి సురేష్‌ప్రభు

దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైన్‌ నేడు ప్రారంభమైంది. కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ప్రభు జెండా వూపి దీనిని ప్రారంభించారు. దీంతో అగర్తల-న్యూదిల్లీ త్రిపుర సుందరీ ఎక్స్‌ప్రెస్‌ దిల్లీ బయల్దేరింది. దీంతో దేశంలోని బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైన్‌ మ్యాప్‌లో త్రిపురకు కూడా స్థానం దక్కింది. అగర్తల నుంచి బంగ్లాదేశ్‌లోని అఖౌరా ప్రాంతానికి రైల్వేలైన్‌ నిర్మాణానికి రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు, బంగ్లాదేశ్‌కు చెందిన మంత్రి ముజుబుల్‌ హక్‌లు సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ మార్గంలో త్రిపుర సుందరీ ఎక్స్‌ప్రెస్‌ వారానికి ఒక్క నడుస్తుంది. ఆదివారం బయల్దేరి 47గంటల తర్వాత దిల్లీకి చేరుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com