ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు

- February 28, 2026 , by Maagulf
ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా కాకుండా, తమ జ్ఞానం మరియు ప్రతిభను ప్రదర్శించేందుకు లభించిన మంచి అవకాశంగా భావించాలని ఆయన సూచించారు.

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో పరీక్షలను ఎదుర్కోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ తమ అత్యుత్తమ ప్రతిభను కనబరచాలని సూచించారు. ఆత్మవిశ్వాసమే విజయానికి కీలకమని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల విజయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను గవర్నర్ ప్రశంసించారు.వారి ప్రోత్సాహం, మార్గనిర్దేశం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com