జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!
- March 01, 2026
జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!
దుబాయ్: జెబెల్ అలీ పోర్టులోని ఒక బెర్త్లో జరిగిన అగ్ని ప్రమాదానికి డ్రోన్ శిథిలాలే కారణం అని దుబాయ్ అధికారులు తెలిపారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.
కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో 2021, జూలై 7 నాటిదని, ఇక అలాంటి పాత వీడియోను ప్రసారం చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు. ఇరాన్ చేసిన డ్రోన్ దాడి సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే, తప్పుడు వీడియోలను షేర్ చేయడం ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారవుతారని హెచ్చరించారు. అధికారిక ఛానెల్స్ ద్వారా మాత్రమే సమాచారాన్ని పొందాలని సూచించింది.
తాజా వార్తలు
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!









