పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- March 01, 2026
టీ20 ప్రపంచ కప్ 2026 లో పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ టోర్నీ నుంచి పాకిస్తాన్ అధికారికంగా ఎలిమినేట్ అయ్యింది. సెమీస్ కు చేరాలంటే శ్రీలంకను 147 పరుగులకే కట్టడి చేయాల్సి ఉంది. అయితే, అందులో పాక్ విఫలమైంది.
సూపర్-8లో భాగంగా పల్లెకలె వేదికగా శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. కీలక మ్యాచ్ లో పాక్ చెలరేగింది. భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీతో చెలరేగాడు. 59 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. సెంచరీ చేసిన వెంటనే ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. పాక్ మరో ఓపెనర్ ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లోనే 84 రన్స్ చేశాడు. 4 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు.
భారీ స్కోర్ చేయడంలో పాక్ సక్సెస్ అయినా.. శ్రీలంకను 147 పరుగులకే కట్టడి చేయడంలో విఫలమైంది. దాంతో ఈ మ్యాచ్ లో పాక్ గెలిచినా ఎందుకూ పనికి రాకుండా పోయింది. గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్ తో పాటు న్యూజిలాండ్ సెమీస్ చేరింది. 3 పాయింట్లు, నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో సెమీస్ కు అర్హత సాధించింది కివీస్ జట్టు
ఈ మ్యాచ్ లో పాక్ కేవలం 5 రన్స్ తేడాతో లంకపై గెలిచింది. 213 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంక.. పాక్ ను ఓడించినంత పని చేసింది. అయితే 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో శనక, పవన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మరీ ముఖ్యంగా శనక విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 31 బంతుల్లోనే 76 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 సిక్సులు ఉన్నాయి. శనక సృష్టించిన విధ్వంసంతో ఈ టోర్నీలో పాక్ ఖేల్ ఖతమైంది
తాజా వార్తలు
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి









