63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- March 01, 2026
దోహా: తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన 65 బాలిస్టిక్ క్షిపణులు మరియు 12 డ్రోన్లతో అడ్డుకున్నట్లు ఖతార్ ప్రకటించింది. ఇరాన్ దాడులను ఖతార్ సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయని తెలిపింది. ఈ దాడిలో ఆస్తి నష్టంతోపాటు ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారని పేర్కొంది.
అయితే, రెండు క్షిపణులు అల్ ఉదీద్ వైమానిక స్థావరానికి చేరుకున్నాయని, అందులో ఒకటి ముందస్తు హెచ్చరిక రాడార్ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు, ఖతార్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో శిథిలాలు పడినట్టు వచ్చిన 114 నివేదికలపై పబ్లిక్ ప్రత్యేక బృందాలు స్పందించాయి తెలిపింది. నివాసితులు ఇంటి లోపలే ఉండాలని, పుకార్లను నమ్మొద్దని, డాదులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తీయకుండా ఉండాలని ముందస్తు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేశారు.
ఈ దాడిని జాతీయ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం మరియు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. దాడులకు గురైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ మరియు జోర్డాన్లకు సంఘీభావాన్ని ప్రకటించింది.
డ్రోన్ శిథిలాల ఫలితంగా అబుదాబిలో ఒక పాకిస్తానీ నివాసి మరణించినందుకు దోహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇస్లామాబాద్లకు తన సంతాపాన్ని తెలియజేసింది. ఈ ప్రాంతంలో తీవ్రమైన పరిణామాలను నివారించడానికి ఉద్రిక్తతను తగ్గించడానికి మరియు దౌత్య పరమైన చర్చలను తిరిగి ప్రారంభించాలని ఖతార్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







