బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- March 01, 2026
మస్కట్: చెన్నై నుంచి మస్కట్కు బయలుదేరిన గంటలోనే ఫ్లైట్ రిటర్న్ అయింది. దీనిపై ప్రయాణికులు తమ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ గంటలో అనిశ్చితి వాతావరణం నెలకొందని, ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ ఆందోళన పడ్డారని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరిన ఒమన్ ఎయిర్ ఫ్లైట్ లో హరి ఒకరు. తన సీటులో కూర్చుని, సందడిగా ఉన్న విమానాశ్రయం నుండి విమానం మేఘాల మీదకు చేరుకుంది. కానీ విమానం బయలుదేరిన గంటలోనే ఉత్సాహం గందరగోళంగా మారింది. విమానం తిరిగి చెన్నై వెళుతుందని ప్రకటన వచ్చిందని హరి గుర్తుచేసుకున్నాడు. ఎందుకు రిటర్న అవుతుందో వివరణ లేదు, అకస్మాత్తుగా ప్రకటన వచ్చింది, ఆపై మేము చెన్నైకి తిరిగి చేరుకున్నామని తెలిపాడు.
విమానంలో అందరి ముఖాల్లో ఆందోళన కనిపించిందని గుర్తుచేసుకున్నాడు. ప్రయాణికులు విమానంలోనే గంటల తరబడి కూర్చుండిపోయారు. చివరకు విమానయాన సంస్థలను సంప్రదించాక ప్రయాణికులను దిగడానికి అనుమతించారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో హరి కూడా చాలా మందిలాగే నిస్సహాయతతో చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగి ఇంటికి చేరుకున్నట్లు పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. గల్ఫ్లో పెరుగుతున్న ఘర్షణలు, గగనతల మూసివేతలు మరియు ఆగిపోయిన విమానాలు వంటి విస్తృత తుఫానులో ఈ అంతరాయం ఒక చిన్న మానవ అలజడి అని మరికొందరు వేదాంత ధోరణిలో పోస్టులు పెట్టారు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సైనిక దాడులు గల్ఫ్ అంతటా విస్తృతమైన నేపథ్యంలో జీసీసీ స్టేట్స్ గగనతలం మూసివేత ప్రకటించడంతో వేలాది మంది ప్రయాణికులు వేర్వేరు విమానాశ్రయాలలో గంటల తరబడి చిక్కుకుపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!
- విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!









