63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- March 01, 2026
దోహా: తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన 65 బాలిస్టిక్ క్షిపణులు మరియు 12 డ్రోన్లతో అడ్డుకున్నట్లు ఖతార్ ప్రకటించింది. ఇరాన్ దాడులను ఖతార్ సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయని తెలిపింది. ఈ దాడిలో ఆస్తి నష్టంతోపాటు ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారని పేర్కొంది.
అయితే, రెండు క్షిపణులు అల్ ఉదీద్ వైమానిక స్థావరానికి చేరుకున్నాయని, అందులో ఒకటి ముందస్తు హెచ్చరిక రాడార్ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు, ఖతార్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో శిథిలాలు పడినట్టు వచ్చిన 114 నివేదికలపై పబ్లిక్ ప్రత్యేక బృందాలు స్పందించాయి తెలిపింది. నివాసితులు ఇంటి లోపలే ఉండాలని, పుకార్లను నమ్మొద్దని, డాదులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తీయకుండా ఉండాలని ముందస్తు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేశారు.
ఈ దాడిని జాతీయ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం మరియు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. దాడులకు గురైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ మరియు జోర్డాన్లకు సంఘీభావాన్ని ప్రకటించింది.
డ్రోన్ శిథిలాల ఫలితంగా అబుదాబిలో ఒక పాకిస్తానీ నివాసి మరణించినందుకు దోహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇస్లామాబాద్లకు తన సంతాపాన్ని తెలియజేసింది. ఈ ప్రాంతంలో తీవ్రమైన పరిణామాలను నివారించడానికి ఉద్రిక్తతను తగ్గించడానికి మరియు దౌత్య పరమైన చర్చలను తిరిగి ప్రారంభించాలని ఖతార్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఏపీ నూతన సీఎస్గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!









