అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!

- March 02, 2026 , by Maagulf
అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!

అబుదాబిః గల్ఫ్ దేశాలలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ మిస్సైల్ దాడులతో యూఏఈ ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. దీంతో వేల సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. కాగా,  అతిథుల హోటల్ గదుల సమాయాన్ని పొడిగించాలని అబుదాబి సంస్కృతి మరియు పర్యాటక శాఖ (DCT అబుదాబి) హోటళ్లను ఆదేశించింది.  అదనపు ఖర్చును అధికార యంత్రాంగం భరిస్తుందని తెలిపింది.  సంబంధిత ఇన్‌వాయిస్‌లను నేరుగా అధికారులకు పంపాలని హోటళ్లను కోరింది. దాదాపు 20,200 మంది ప్రయాణికులు తాత్కాలిక వసతి మరియు రీబుకింగ్ మద్దతును పొందారని పేర్కొంది. ప్రభావిత విజిటర్స్ ను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికి నివాసితులు మరియు ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com