ఎన్డీయే నుంచి బయటకు రావడం రెండు నిముషాల పని : చంద్రబాబు
- July 31, 2016
ఎన్డీయే నుంచి బయటకు రావడం రెండు నిముషాల పని అన్నారు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ కి హోదా పై తమ పార్టీ నేతలతో సుదీర్ఘంగా ఆయన చర్చించారు. హోదా విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బీజెపీ తోఅమీతుమీ తేల్చుకుంటామని మీడియా వద్ద మాట్లాడిన ఆయన-తమ పార్టీ నాయకులతో జరిపిన సమావేశంలో మాత్రంఆ దూకుడు చూపకపోవడం విశేషం. ఎవరితోనూ యుద్ధం చేయాలన్న ఆలోచన తనకు లేదని, ప్రధాని మోదీ స్పందనను బట్టి కొన్ని రోజులు వేచి చూసి కార్యాచరణ కు పూనుకొందామని చంద్రబాబు చెప్పారు.మీరు ఆదేశిస్తే రాజీనామాకు మేము సిద్ధం అని కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి వ్యాఖ్యానించగా..ఇప్పుడే దీనిపై మాట్లాడవద్దని బాబు అన్నారు. నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.. రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించను..అయితే హోదా ఇస్తామన్న బీజెపీ నాయకత్వ హామీని ఆ పార్టీ నేతలకే గుర్తు చేద్దాం అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







