ఎన్డీయే నుంచి బయటకు రావడం రెండు నిముషాల పని : చంద్రబాబు
- July 31, 2016
ఎన్డీయే నుంచి బయటకు రావడం రెండు నిముషాల పని అన్నారు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ కి హోదా పై తమ పార్టీ నేతలతో సుదీర్ఘంగా ఆయన చర్చించారు. హోదా విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బీజెపీ తోఅమీతుమీ తేల్చుకుంటామని మీడియా వద్ద మాట్లాడిన ఆయన-తమ పార్టీ నాయకులతో జరిపిన సమావేశంలో మాత్రంఆ దూకుడు చూపకపోవడం విశేషం. ఎవరితోనూ యుద్ధం చేయాలన్న ఆలోచన తనకు లేదని, ప్రధాని మోదీ స్పందనను బట్టి కొన్ని రోజులు వేచి చూసి కార్యాచరణ కు పూనుకొందామని చంద్రబాబు చెప్పారు.మీరు ఆదేశిస్తే రాజీనామాకు మేము సిద్ధం అని కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి వ్యాఖ్యానించగా..ఇప్పుడే దీనిపై మాట్లాడవద్దని బాబు అన్నారు. నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.. రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించను..అయితే హోదా ఇస్తామన్న బీజెపీ నాయకత్వ హామీని ఆ పార్టీ నేతలకే గుర్తు చేద్దాం అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







