పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో హెరాయిన్ అక్రమరవాణా ..
- July 31, 2016
విమానాశ్రయాల్లో మాదకద్రవ్యాలు, బంగారం అక్రమరవాణా చేస్తూ పట్టుబడే వ్యక్తులను సధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఎయిర్ లైన్స్ సిబ్బందే అక్రమరవాణాకు పాల్పడితే..! అదే జరిగింది పాకిస్తాన్ లో. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందిన 12 మంది సిబ్బంది హెరాయిన్ అక్రమరవాణా చేస్తూ ఆదివారం పట్టుబడ్డారు. లాహోర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో పెద్ద ఎత్తున మత్తుపదార్థాలు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ ఫోర్స్(ఎఎన్ఎఫ్).. విమానం టాయ్ లెట్ లో 6 కిలోల హెరాయిన్ ను గుర్తించింది. దీని విలువ సుమారు ఆరు కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. .తమ సిబ్బంది 12 మంది అరెస్టు అయిన విషయాన్ని పీఐఏ స్పోక్స్ పర్సన్ డానియల్ గిలానీ ధృవీకరించారు. విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పీఐఏ సిబ్బంది ఇటీవల డ్రగ్స్, సిగరెట్లు, అక్రమ పాస్ పోర్ట్ లు, మొబైల్ ఫోన్ లు తరలిస్తూ పట్టుబడటం సర్వసాధారణంగా మారింది. అయితే.. ఒకేసారి ఎక్కువ మొత్తంలో సిబ్బంది ప్రమేయం ఉడటం కలకలం సృష్టిస్తోంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







