తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..
- July 31, 2016
ఈశాన్య, వాయవ్య దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కదులుతోంది. వీటి ప్రభావంతో సోమవారం ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం ఏర్పడ్డాక ఉత్తర కోస్తాలో ఆదివారం సాయంత్రం నుంచే ఉరుములు, మెరుపులతో వర్షాలు మొదలయ్యాయి. ఇవి క్రమంగా పెరిగే వీలుందని అధికారులు వెల్లడించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశకు వస్తే ...కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో తీరం వెంబడి పడమటి దిశగా గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నందున సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల మధ్య రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. పెద్దాపురంలో అత్యధికంగా 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







