అజిత్ చిత్రంలో ముగ్గురు కథానాయికలు!
- July 31, 2016
తమిళ నటుడు అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నారట. ఇప్పటికే కాజల్ అగర్వాల్ పేరును ఖరారు చేయగా.. మరో ఇద్దరు నటీమణుల కోసం చిత్రం బృందం అన్వేషిస్తోందని తెలిసింది.ఈ చిత్రంలో సీక్రెట్ ఏజెంట్గా కనిపించనున్న అజిత్కు కాజల్ భార్యగా నటించనుంది. వీళ్లకు సూటయ్యేలా మరో కథానాయిక కోసం చిత్రబృందం వెతుకుతోందట. మూడో హీరోయిన్ అతిథి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అయితే.. రెండో కథానాయికగా నటుడు కమల్హాసన్ కూతురు అక్షర హాసన్ను తీసుకున్నట్లు వూహాగానాలు వస్తున్నాయి. .ఇప్పటికే చిత్రబృందం పలువురు కథానాయికలను సంప్రదించిందని.. అందులో ఎవరనేది ఫైనలైజ్ చేయాల్సి ఉందని తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి. శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ వచ్చే వారం బల్గేరియాలో ప్రారంభం కానుందట.
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







