అజిత్ చిత్రంలో ముగ్గురు కథానాయికలు!
- July 31, 2016
తమిళ నటుడు అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నారట. ఇప్పటికే కాజల్ అగర్వాల్ పేరును ఖరారు చేయగా.. మరో ఇద్దరు నటీమణుల కోసం చిత్రం బృందం అన్వేషిస్తోందని తెలిసింది.ఈ చిత్రంలో సీక్రెట్ ఏజెంట్గా కనిపించనున్న అజిత్కు కాజల్ భార్యగా నటించనుంది. వీళ్లకు సూటయ్యేలా మరో కథానాయిక కోసం చిత్రబృందం వెతుకుతోందట. మూడో హీరోయిన్ అతిథి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అయితే.. రెండో కథానాయికగా నటుడు కమల్హాసన్ కూతురు అక్షర హాసన్ను తీసుకున్నట్లు వూహాగానాలు వస్తున్నాయి. .ఇప్పటికే చిత్రబృందం పలువురు కథానాయికలను సంప్రదించిందని.. అందులో ఎవరనేది ఫైనలైజ్ చేయాల్సి ఉందని తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి. శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ వచ్చే వారం బల్గేరియాలో ప్రారంభం కానుందట.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







