రాజ్‌నాథ్‌ను పాక్‌లో అడ్డుకుంటామని సయ్యద్‌ సలాహుద్దీన్‌

- August 01, 2016 , by Maagulf
రాజ్‌నాథ్‌ను పాక్‌లో అడ్డుకుంటామని సయ్యద్‌ సలాహుద్దీన్‌

పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లనున్న భారత హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ భద్రత పట్ల ఆ దేశమే బాధ్యత వహిస్తుందని భారత విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. సార్క్‌ సమావేశాల కోసం ఈ వారంలో రాజ్‌నాథ్‌ ఇస్లామాబాద్‌ వెళ్లాల్సి ఉంది. అయితే ఆదివారం లాహోర్‌లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ నిర్వహించిన ర్యాలీలో ఆ సంస్థ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌మాట్లాడుతూ.. రాజ్‌నాథ్‌ను పాక్‌లో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. రాజ్‌నాథ్‌ పర్యటనలో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించింది.రాజ్‌నాథ్‌ పాక్‌కు రాకుండా అడ్డుకోవాలని పాక్‌ ప్రభుత్వానికి సయ్యద్‌ హెచ్చరికలు చేశాడు. కశ్మీర్‌లో సైన్యాన్ని మోహరింపజేసి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. అయితే ఈ అంశంపై పాకిస్థాన్‌ ప్రభుత్వం స్పందించలేదు. ఇటీవల హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వనిని భద్రతాదళాలు హతమార్చినప్పటి నుంచి కశ్మీర్‌లో అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీందో భారత్‌, పాక్‌ల మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌ పాకిస్థాన్‌ పర్యటన కూడా ఉద్రిక్తతకు దారితీస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com