రాజ్నాథ్ను పాక్లో అడ్డుకుంటామని సయ్యద్ సలాహుద్దీన్
- August 01, 2016
పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న భారత హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భద్రత పట్ల ఆ దేశమే బాధ్యత వహిస్తుందని భారత విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. సార్క్ సమావేశాల కోసం ఈ వారంలో రాజ్నాథ్ ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే ఆదివారం లాహోర్లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ నిర్వహించిన ర్యాలీలో ఆ సంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్మాట్లాడుతూ.. రాజ్నాథ్ను పాక్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. రాజ్నాథ్ పర్యటనలో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించింది.రాజ్నాథ్ పాక్కు రాకుండా అడ్డుకోవాలని పాక్ ప్రభుత్వానికి సయ్యద్ హెచ్చరికలు చేశాడు. కశ్మీర్లో సైన్యాన్ని మోహరింపజేసి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. అయితే ఈ అంశంపై పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించలేదు. ఇటీవల హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనిని భద్రతాదళాలు హతమార్చినప్పటి నుంచి కశ్మీర్లో అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీందో భారత్, పాక్ల మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ పాకిస్థాన్ పర్యటన కూడా ఉద్రిక్తతకు దారితీస్తోంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







