శశికళా పుష్పపై పార్టీ అధినేత్రి జయలలిత వేటు ..
- August 01, 2016
అన్నాడీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్పపై పార్టీ అధినేత్రి జయలలిత వేటు వేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడమే కాక, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే.. రాజీనామా చేయడానికి తిరస్కరించిన శశికళ.. నేరుగా ఢిల్లీ వెళ్లి రాజ్యసభ సమావేశాల్లో పాల్గొనడమే కాక, అక్కడ కన్నీరు కూడా పెట్టారు.ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను.. అన్నాడీఎంకే ఎంపీ శశికళ చెంపమీద కొట్టిన విషయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ రాజ్యసభ సభ్యులే. పార్టీ పరువుకు భంగం కలిగించేలా ఢిల్లీ ఎయిర్ పోర్టులో వ్యవహరించారంటూ శశికళపై జయలలిత మండిపడ్డారు. ఆదివారం నాడు పోయస్ గార్డెన్స్ కు వెళ్లి వివరణ ఇచ్చినా ఆమె శాంతించలేదు. పార్టీ నుంచి వచ్చింది కాబట్టి రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేయాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







