ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!

- March 05, 2026 , by Maagulf
ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!

జెనీవాః రియాద్  మరియు తూర్పు ప్రావిన్స్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఇరానియన్ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ దాడులను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాలని ఐక్యరాజ్యసమితి మరియు జెనీవాలోని  అంతర్జాతీయ సంస్థలకు సౌదీ అరేబియా శాశ్వత ప్రతినిధి రాయబారి అబ్దుల్‌మోహ్సేన్ బిన్ ఖోథైలా పిలుపునిచ్చారు. ఇరాన్ దాడులు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ శాంతికి తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయని పేర్కొన్నారు. జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 61వ సమావేశంలో  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్ మరియు జోర్డాన్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేసిన క్రూరమైన దాడులను బిన్ ఖోథైలా తీవ్రంగా ఖండించారు. ఇది ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని మరియు మంచి పొరుగు దేశాల సూత్రాలను స్పష్టంగా ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు.అంతే కాకుండా అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను స్పష్టంగా ఉల్లంఘించిందని తెలిపారు.
"ఈ దాడులు పౌర సౌకర్యాలు మరియు నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. పౌరులు మరియు నివాసితుల భద్రత, జీవితాలకు ముప్పు కలిగిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ మానవతా చట్టం మరియు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం నియమాలను తీవ్రంగా ఉల్లంఘించడమే. " అని ఆయన అన్నారు. సౌదీ అరేబియా తన పౌరులను మరియు నివాసితులను రక్షించడంతో పాటు, సార్వభౌమత్వాన్ని మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com