అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- March 05, 2026
టెహ్రాన్: శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ముంచేయడం పశ్చిమాసియా మరియు దక్షిణాసియా జలాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ నావికాదళానికి చెందిన ప్రతిష్టాత్మక యుద్ధనౌక IRIS దేనా హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా, అమెరికాకు చెందిన ఒక శక్తివంతమైన జలాంతర్గామి దానిని ఢీకొట్టి ముంచేసింది. ఇరాన్ తీరానికి దాదాపు 2,000 మైళ్ల దూరంలో, అంతర్జాతీయ జలాల్లో ఈ దాడులు జరగడం గమనార్హం. భారత నావికాదళానికి అతిథిగా వెళ్తున్న సమయంలోనే ఈ అటాక్ జరిగిందని ఇరాన్ ఆరోపిస్తోంది.
ఈ యుద్ధనౌకలో దాదాపు 130 మంది నావికులు ఉన్నట్లు సమాచారం. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా అమెరికా ఈ “దారుణానికి” పాల్పడిందని అరాఘ్చి విమర్శించారు. “అమెరికా సృష్టించిన ఈ ప్రమాదకరమైన సంప్రదాయానికి ఆ దేశం భవిష్యత్తులో తీవ్రంగా పశ్చాత్తాపపడక తప్పదు” అని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు పశ్చిమాసియాకే పరిమితమైన ఇరాన్-అమెరికా ఘర్షణలు, ఇప్పుడు హిందూ మహాసముద్రానికి పాకడం భారత్ వంటి దేశాలకు ఆందోళన కలిగించే విషయం. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో ఇలాంటి దాడులు జరగడం వల్ల ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా ఈ ఘటన పై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించనప్పటికీ, ఇరాన్ మాత్రం దీనిని యుద్ధ నేరంగా పరిగణిస్తోంది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









