ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- March 07, 2026
మస్కట్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మిడిలీస్టు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై జీసీసీ అఫిషియల్స్ వర్చువల గా సమీక్షించారు. ఇందులో ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధులతోపాటు గల్ఫ్ సహకార మండలి (GCC) సభ్య దేశాల సమాచార మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీలు సమావేశంలో పాల్గొన్నారు.
మిడిలీస్టులో ప్రస్తుత పరిణామాలకు సంబంధించి GCC దేశాల మధ్య మీడియా సమన్వయాన్ని పెంచే మార్గాలపై సమావేశంలో చర్చించారు. ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వంపై చూపే ప్రభావాలను పరిష్కరించడంలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఇరాన్ దురాక్రమణను మరింత సమర్థవంతంగా తెలియజేయాలని అందుకు చేపట్టాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. GCC సభ్య దేశాల మధ్య మీడియా సంయుక్త ప్రయత్నాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒమన్ సమాచార మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









