ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- March 07, 2026
మస్కట్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మిడిలీస్టు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై జీసీసీ అఫిషియల్స్ వర్చువల గా సమీక్షించారు. ఇందులో ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధులతోపాటు గల్ఫ్ సహకార మండలి (GCC) సభ్య దేశాల సమాచార మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీలు సమావేశంలో పాల్గొన్నారు.
మిడిలీస్టులో ప్రస్తుత పరిణామాలకు సంబంధించి GCC దేశాల మధ్య మీడియా సమన్వయాన్ని పెంచే మార్గాలపై సమావేశంలో చర్చించారు. ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వంపై చూపే ప్రభావాలను పరిష్కరించడంలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఇరాన్ దురాక్రమణను మరింత సమర్థవంతంగా తెలియజేయాలని అందుకు చేపట్టాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. GCC సభ్య దేశాల మధ్య మీడియా సంయుక్త ప్రయత్నాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒమన్ సమాచార మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









