ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- March 07, 2026
మస్కట్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మిడిలీస్టు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై జీసీసీ అఫిషియల్స్ వర్చువల గా సమీక్షించారు. ఇందులో ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధులతోపాటు గల్ఫ్ సహకార మండలి (GCC) సభ్య దేశాల సమాచార మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీలు సమావేశంలో పాల్గొన్నారు.
మిడిలీస్టులో ప్రస్తుత పరిణామాలకు సంబంధించి GCC దేశాల మధ్య మీడియా సమన్వయాన్ని పెంచే మార్గాలపై సమావేశంలో చర్చించారు. ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వంపై చూపే ప్రభావాలను పరిష్కరించడంలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఇరాన్ దురాక్రమణను మరింత సమర్థవంతంగా తెలియజేయాలని అందుకు చేపట్టాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. GCC సభ్య దేశాల మధ్య మీడియా సంయుక్త ప్రయత్నాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒమన్ సమాచార మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









