ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- March 07, 2026
మస్కట్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మిడిలీస్టు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై జీసీసీ అఫిషియల్స్ వర్చువల గా సమీక్షించారు. ఇందులో ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధులతోపాటు గల్ఫ్ సహకార మండలి (GCC) సభ్య దేశాల సమాచార మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీలు సమావేశంలో పాల్గొన్నారు.
మిడిలీస్టులో ప్రస్తుత పరిణామాలకు సంబంధించి GCC దేశాల మధ్య మీడియా సమన్వయాన్ని పెంచే మార్గాలపై సమావేశంలో చర్చించారు. ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వంపై చూపే ప్రభావాలను పరిష్కరించడంలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఇరాన్ దురాక్రమణను మరింత సమర్థవంతంగా తెలియజేయాలని అందుకు చేపట్టాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. GCC సభ్య దేశాల మధ్య మీడియా సంయుక్త ప్రయత్నాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒమన్ సమాచార మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









