ఉష్ణోగ్రతల పెరుగుదలతో చేపల ధరలకు రెక్కలు
- August 01, 2016
ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఖతారీ సముద్రజలాల్లో ఫిషింగ్ కష్టమవుతోంది. దాంతో, డిమాండ్కి తగ్గట్లుగా చేపలు దొరక్క దోహా సెంట్రల్ మార్కెట్లో చేపల ధరలకు రెక్కలు వచ్చాయి. కింగ్ఫిష్ (చనాద్) ధర మామూలు రోజుల్లో కిలో 30 ఖతారీ రియాల్స్ ఉంటే, ఆ ధర ఇప్పుడు 52 ఖతారీ రియాల్స్కి పెరిగింది. హేమర్ ధర మామూలు సీజన్తో పోల్చితే ఇప్పుడు రెట్టింపు అయ్యింది. షారి ధర 15 నుంచి 18 ఖతారీ రియాల్స్కి చేరుకుంది. ఇది మామూలుగా అయితే కేవలం 8 ఖతారీ రియాల్స్కే దొరుకుతుంది. సాఫి చేప ధర 35 నుంచి 55 ఖతారీ రియాల్స్కి పెరిగింది. సముద్రంలో చేపల వేట కష్టంగా మారిందనీ, వాతావరణ పరిస్థితులతో చేపలు సముద్రంలో దొరకడంలేదని ఫిషర్మెన్ చెప్పారు. గతంతో పోల్చితే ఇప్పుడు చేపల లభ్యత 50 శాతానికి పడిపోయిందని వారు వివరించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







