మైసూరులో బాంబు పేలుడు
- August 01, 2016
సాంసృతిక నగరంగా పేరు తెచ్చుకున్న మైసూరులో బాంబు పేలుడు సంభవించింది. సోమవారం మైసూరు నగరంలోని కోర్టు ఆవరణంలో ఉన్న బాత్ రూంలో ఈ పేలుడు జరిగింది.
సోమవారం మైసూరు నగరంలోని కోర్టు అవరణంలో కక్షిదారులు, విచారణకు హాజరైన వారు, పోలీసులు అధిక సంఖ్యలో ఉన్నారు. సాయంత్రం ఒక్క సారిగా కోర్టు ఆవరణంలో భారీ శభ్దంతో పేలుడు సంభవించింది.
కోర్టు ఆవరణంలో ఉన్న వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, బాంబు నిర్వీర్యదళం బలగాలు, పోలీసు జాగిలాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
బాంబు పేలుడుతో బాత్ రూం తలుపులు, కిటికీలు ద్వంసం అయ్యాయి. బాత్ రూంలో ఇంకా పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. నాటు బాంబు వలనే పేలుడు సంభవించిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
పేలుడు సంభవించిన పరిసర ప్రాంతాల్లో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. సాయంత్రం 4.15 నుంచి 4.25 గంటల మధ్యలో బాంబు పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ బాంబు పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







