సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్‌వేస్..!!

- March 19, 2026 , by Maagulf
సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్‌వేస్..!!

కువైట్ః వందే భారత్ ప్రాజెక్ట్  కింద జజీరా ఎయిర్‌వేస్ కువైట్ నుండి అల్ ఖైసుమా విమానాశ్రయం మీదుగా ఆరు భారతీయ నగరాలకు ఏకకాలంలో విమాన సర్వీసులను పునఃప్రారంభించినట్లు ప్రకటించింది. సౌదీ అరేబియా మీదుగా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమానయాన సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం మరియు భారతీయ కమ్యూనిటీ తరపున పరామిత త్రిపాఠి అభినందనలు తెలిపారు. ఈ ఏర్పాటుకు మద్దతునిచ్చి, ఆమోదించినందుకు భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్, విదేశీ వ్యవహారాల మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖలకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఫిబ్రవరి 28నుండి కువైట్ గగనతలం తాత్కాలికంగా మూసివేయడం, ప్రయాణించాలనుకునే భారతీయ పౌరులకు అనేక సవాళ్లను సృష్టించిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో జజీరా ఎయిర్‌వేస్ తక్షణ స్పందనను ఆమె ప్రశంసించారు. కువైట్‌లో మరియు ఈ ప్రాంతంలో త్వరలో సాధారణ పరిస్థితులు తిరిగి వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
జజీరా ఎయిర్‌వేస్ ద్వారా భారతదేశానికి విమాన సర్వీసులను పునఃప్రారంభించడాన్ని ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ (IBPC) కువైట్ స్వాగతించింది.కువైట్‌లో పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులు ఉన్నందున, భారతదేశానికి కనెక్టివిటీని పునరుద్ధరించాలని బలమైన డిమాండ్ ఉందని జజీరా ఎయిర్‌వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బరతన్ పశుపతి తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com