ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- March 19, 2026
న్యూ ఢిల్లీ: ఉగాది పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉగాది పండుగ పునరుత్తేజాన్ని వెంట తీసుకువస్తుందని మోదీ పేర్కొన్నారు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అంటూ ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. పండుగకు సంబంధించిన ఓ కోట్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో అమితమైన సంతోషాన్ని, శ్రేయస్సును నింపాలని కోరుకుంటున్నట్లు మోదీ చెప్పారు. ప్రజల జీవితాల్లో అన్ని అంశాల్లోనూ కొత్త ఏడాది కొత్త సంతోషాలను తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









