భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- March 19, 2026
మనామా: బహ్రెయిన్ లోని సీఫ్ డిస్ట్రిక్ట్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనలో, గల్ఫ్ దేశానికి చెందిన ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.శిక్షాకాలం పూర్తయ్యాక అతడిని దేశం నుండి బహిష్కరించాలని ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఆదేశించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం..ఆ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా అతని కారు అదుపు తప్పింది.ఈ ప్రమాదంలో తీవ్రమైన తల గాయాలతో అతని భార్య మరణించగా, అతని ఎడమ చేయి తీవ్రంగా విరిగింది.ఈ ఘటన లో ప్రభుత్వ ఆస్తులకు కూడా నష్టం వాటిల్లింది.
జాగ్రత్తలు
డ్రైవర్ ప్రాథమిక భద్రతా జాగ్రత్తలు పాటించడంలో విఫలమయ్యాడని దర్యాప్తులో నిర్ధారణ అయింది. అతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ నేరుగా అతని భార్య మరణానికి కారణమైందని, దాని పర్యవసానాలకు అతనే బాధ్యుడని కోర్టు తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









