కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- March 20, 2026
కువైట్ః ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ గగనతల మూసివేతల నేపథ్యంలో, కువైట్-భారత్ మధ్య ప్రయాణ అనుసంధానాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఆరు భారతీయ విమానాశ్రయాలకు విమానాలను నడిపేందుకు జజీరా ఎయిర్వేస్కు భారత ప్రభుత్వం ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. వేలాది మంది భారత పౌరులు ఎదుర్కొంటున్న ప్రయాణ అంతరాయాలను తగ్గించేందుకు చేపట్టిన సమన్విత ప్రయత్నాలలో భాగంగా ఈ చొరవ తీసుకున్నట్లు భారత రాయబారి పరామిత త్రిపాఠి తెలిపారు.
ఫిబ్రవరి 28నుండి కువైట్ గగనతలం తాత్కాలికంగా మూసివేయడం వల్ల ప్రయాణికులకు, ముఖ్యంగా భారత్కు అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారికి గణనీయమైన సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సంక్షోభ సమయంలో సహాయం అందించడానికి రాయబార కార్యాలయం అధికారులు మరియు భారతీయ కమ్యూనిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని రాయబారి పేర్కొన్నారు.
రియాద్లోని భారత రాయబార కార్యాలయం మరియు సౌదీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, సౌదీ విమానాశ్రయాల ద్వారా రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా అత్యవసర ప్రయాణం అవసరమైన వారికి తాము సహాయం చేస్తున్నామని తెలిపారు. వారి నిరంతర మద్దతుతో, భారతదేశానికి ప్రయాణించడానికి 1,100 మందికి పైగా భారతీయులు సౌదీ ట్రాన్సిట్ వీసాలు పొందడంలో తాము సహాయం చేశామన్నారు.
తాజా వార్తలు
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!









